Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు: మహిళా జైలు సూపరింటెండెంట్

మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్

Webdunia
గురువారం, 13 జులై 2017 (08:42 IST)
మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్ గోరేకు లేఖ రాశారు. దీనిని ఆమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేసి విచారణ జరిపించాలని కోరారు. 
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీనియర్ అధికారి ఒకరు తనతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారని లేఖలో ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గోరేకు తాను ఎటువంటి లేఖ రాయలేదని ఎస్పీ పేర్కొన్నారు. తనకు అందిన లేఖలో సీనియర్లు తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నదీ, సంబంధం కోసం ఎలా ఒత్తిడి తీసుకొస్తున్నదీ వివరంగా ఉందని గోరే చెప్పారు. తాజా తేదీతో రాసిన ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
లేఖలోని నిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించానని, అయితే ఆమె తనకు లేఖ రాసిన విషయాన్ని ఖండించారని పేర్కొన్నారు. దీంతో ఆమెపై ఎవరి ఒత్తిడో పనిచేస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. ఆమె లేఖలో నిజముందని, ఆ విషయం తేల్చేందుకు విచారణ జరిపించాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం